పొదుపు పేరుతో ప్రజలకు కోట్లలో ముద్ర సంస్థ టోకరా
ABN , First Publish Date - 2022-01-23T15:38:44+05:30 IST
పొదుపు పేరుతో ప్రజలకు కోట్లలో ముద్ర సంస్థ టోకరా
కర్నూలు: కర్నూలు జిల్లాలో పొదుపు పేరిట ముద్ర సంస్థ మోసానికి పాల్పడింది. రోజువారీ పొదుపు పేరుతో ప్రజలకు రూ.కోట్లలో ముద్ర సంస్థ టోకరా వేసింది. ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేసింది. రాయలసీమ జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసింది. గత 3 నెలల నుంచి రుణాలు ఇవ్వడం ముద్ర సంస్థ ఆపివేసింది. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్లపై బాధితులు ఒత్తిళ్లు తెస్తున్నారు.