తోకలవలస సర్పంచ్‌ చిట్టినాయుడు మృతి

ABN , First Publish Date - 2021-05-06T05:04:55+05:30 IST

తోకలవలస సర్పంచ్‌ బుడితి చిట్టి నాయుడు (35) బుధవారం కరోనాకు చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు.

తోకలవలస సర్పంచ్‌ చిట్టినాయుడు మృతి
చిట్టినాయుడు (ఫైల్‌ఫోటో)

రేగిడి:  తోకలవలస సర్పంచ్‌ బుడితి చిట్టి నాయుడు (35) బుధవారం కరోనాకు చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు. గత నెల 29న జ్వరం, ఇతర కరోనా లక్ష ణాలు కనిపించగా పంచాయతీ కార్యదర్శి రాకేష్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించి ఆ మరుసటి రోజున రాగో లు జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ తుదిశ్వాస విడిచినట్లు తహసీల్దార్‌ తెలిపారు. చిట్టినాయుడు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. మృతుడికి భార్య ఉంది.  చిట్టినాయుడు మృతికి పలువురు సంతాపం తెలిపారు. 

 


 

Updated Date - 2021-05-06T05:04:55+05:30 IST