టాయిలెట్‌ సింక్‌లో వేసి పురిటిబిడ్డ హత్య: యువతి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-07T15:24:56+05:30 IST

తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతదేహం వ్యవహారంలో ఓ యువతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో

టాయిలెట్‌ సింక్‌లో వేసి పురిటిబిడ్డ హత్య: యువతి అరెస్టు

పెరంబూర్‌(చెన్నై): తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతదేహం వ్యవహారంలో ఓ యువతిని పోలీసులు సోమవారం అరెస్టు  చేశారు. ఈ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఉన్న టాయిలెట్‌లో నీరు రాకపోవడంతో రోగులు ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు. వెస్ట్రన్‌ టాయిలెట్‌ సింక్‌కు  వెనుక ఉన్న బాక్స్‌ను పరిశీలించిన సిబ్బంది, అందులో ఓ పసికందు శవం వుండడం చూసి దిగ్ర్భాంతి చెందారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వలం సమీపం ఆలంగుడికి చెందిన యువతి (23)ని అరెస్టు చేసి చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవివాహితురాలైన ఆమె ఓ బనియన్‌ కంపెనీలో పనిచేస్తూ తోటి ఉద్యోగితో ప్రేమలో పడిందని, ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేస్తే ప్రమాదమని భావించి 3వ తేదీ కడుపు నొప్పి అని తంజావూరు ప్రభుత్వాస్పత్రిలో చేరినట్టు తెలిసింది. అక్కడినుంచి ఆమె వైద్య కళాశాల ఆస్పత్రికి వచ్చిందని, అక్కడ అరగంట తిరిగిన ఆమె ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లి తానే ప్రసవం చేసుకొని, పసికందును పెట్టెలోని నీళ్లలో వేసి హతమార్చినట్టు తెలిసింది. అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఆమె బయటకు వచ్చే దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదు కావడంతో ఆమెను అరెస్ట్టు చేసిన పోలీసులు, ఇందులో ఆమె తల్లిదండ్రుల ప్రమేయం కూడా వుంటుందని భావించి వారిని విచారిస్తున్నారు.

Updated Date - 2021-12-07T15:24:56+05:30 IST