పెళ్లి కళ లేకుండానే ఒక్కటయ్యారు!
ABN , First Publish Date - 2020-04-10T06:03:17+05:30 IST
బాజా భజంత్రీలు లేవు.. బంధుమిత్రుల ఊసేలేదు. స్నేహితుల ఆర్భాటం అంత కన్నా లేదు..
సిటీ న్యూస్: బాజా భజంత్రీలు లేవు.. బంధుమిత్రుల ఊసేలేదు. స్నేహితుల ఆర్భాటం అంత కన్నా లేదు.. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలన్న వారిద్దరు నలుగురి మధ్య సాదాసీదాగా ఒక్కటయ్యారు. వెంకటగిరిలోని పద్మశాలీయుల కల్యాణ మండపంలో గురువారం ఉదయం ఓ పెళ్లి నిరాడంబరంగా జరిగింది.
వెంకటగిరికి చెందిన రంగినేని వినోద్కు, పొదలకూరుకు చెందిన దీపికకు ఈనెల 9వ తేదీన పెళ్లి కుదిరింది. స్థానిక పద్మశాలీయుల కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వివాహానికి బంధు మిత్రులెవరూ హాజరుకాలేదు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా తమ తల్లిదండ్రుల సమక్షంలో పూజారి వేద మంత్రాల ఉచ్ఛారణ మధ్య వరుడు, వధువు ఒక్కటయ్యారు.