వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు నెలకొల్పిన భారత్.. ధన్యవాదాలంటూ మోదీ ట్వీట్

ABN , First Publish Date - 2021-06-22T01:59:47+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది

వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు నెలకొల్పిన భారత్.. ధన్యవాదాలంటూ మోదీ ట్వీట్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 70 లక్షల మంది ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. 

హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘వ్యాక్సినేషన్ ఇంత పెద్ద మొత్తంలో జరగడం ఆనందదాయకం. కోవిడ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. చాలా మంది పౌరులకు వ్యాక్సిన్ సక్రమంగా అందేలా కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులకు, టీకాలు వేసుకున్న వారికి ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా’’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. 


Updated Date - 2021-06-22T01:59:47+05:30 IST