నేడు, రేపు హెల్ప్ డెస్క్ ఏర్పాటు
ABN , First Publish Date - 2022-06-30T04:54:23+05:30 IST
వంశధార నిర్వాసితులకు ప్రభుతం మంజూరు చేసిన అదనపు పరిహారం చెల్లింపులకు దరఖాస్తులు స్వీకరించేందుకు గాను హిరమండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురు, శుక్ర వారాలు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు టెక్కలి ఆర్డీవో జయరాం తెలిపారు. బుధవారం నిర్వాసితుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలిం చారు.
హిరమండలం: వంశధార నిర్వాసితులకు ప్రభుతం మంజూరు చేసిన అదనపు పరిహారం చెల్లింపులకు దరఖాస్తులు స్వీకరించేందుకు గాను హిరమండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురు, శుక్ర వారాలు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు టెక్కలి ఆర్డీవో జయరాం తెలిపారు. బుధవారం నిర్వాసితుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించారు. అదనపు పరిహారం పొందేందుకు జాబితాల్లో పేర్లు లేని వారు, రిమార్కులున్నవారు అన్ని ఆధారాలతో దరఖాస్తు అందజేయాలన్నారు. ప్యాకేజీ మంజూరు తన పరిధిలో లేదని కలెక్టర్ ఆధ్వర్యంలో చెల్పింపులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.100 కోట్లకు ప్రభుత్వానికి బిల్లు పెట్టడం జరిగిందన్నారు. ఇటీవల రెండు రోజులు రిజర్వ్ బ్యాంకు సెలవులు ఉండడంతో కొంతమందికి పరిహారం ఇంకా బ్యాంకు ఖాతాల్లో పడకపోయి ఉండవచ్చన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.