నేడు నామినేషన్లు
ABN , First Publish Date - 2021-02-28T05:33:33+05:30 IST
గత ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో మరోసారి నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది.
- మృతి చెందిన అభ్యర్థుల స్థానాల్లో..
- 3న ఉపసంహరణ , 10న పోలింగ్, 14న కౌంటింగ్
- 9 మున్సిపాలిటీల్లో 10,51,208 మంది ఓటర్లు
కర్నూలు (అర్బన్), ఫిబ్రవరి 27: గత ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో మరోసారి నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్ 14వ డివిజన్, ఎమ్మిగనూరులో 4వ వార్డు, గూడూరులో 19వ వార్డులకు ఆదివారం నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 3న ఉపసంహరణ, మార్చి 10న పోలింగ్, మార్చి 14న కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థ, ఒక నగర పంచాయతీలో 302 వార్డులు, 979 పొలింగ్ స్టేషన్లు ఉండగా 1,841 బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశారు. 10,51,208 మంది ఓటర్లు ఉండగా పురుషులు 5,15,835, మహిళలు 5,35,097, ఇతరులు 276 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మకం 302, సమస్యాత్మకం 317, సాధారణం 360 ఉన్నట్లు అధికారులు తెలిపారు.