నేడు ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-02-28T06:19:24+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆదివారం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంస్‌), నేషనల్‌ ట్యాలెంట్‌ సెర్చ్‌(ఎన్‌టీఎస్‌) పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్‌ ప్రభావతి శనివారం తెలిపారు.

నేడు ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ పరీక్షలు

చిత్తూరు(సెంట్రల్‌), ఫిబ్రవరి 27: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంస్‌), నేషనల్‌ ట్యాలెంట్‌ సెర్చ్‌(ఎన్‌టీఎస్‌) పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్‌ ప్రభావతి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష జరుగుతుంది. 3420 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా చిత్తూరులోని 8 కేంద్రాల్లో ఎన్‌టీఎస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌ ఉదయం 9.30నుంచి 11..30 గంటల వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 2వేల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు విద్యార్థులందరూ మాస్క్‌లు ధరించి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కమిషనర్‌ ప్రభావతి సూచించారు. 

Updated Date - 2021-02-28T06:19:24+05:30 IST