మడికయ్యల శివాలయంలో నేడు మహన్యాస రుద్రాభిషేకం

ABN , First Publish Date - 2021-05-17T06:06:17+05:30 IST

మదనపల్లె పట్టణంలోని చిప్పిలి గ్రామంలో మడికయ్యలశివాలయంలో యోగభోగేశ్వరస్వామికి సోమవారం మహ న్యాస రుద్రాభిషేకం, హోమాలు నిర్వహి స్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వేశ్వరప్రసాద్‌ తెలిపారు.

మడికయ్యల శివాలయంలో నేడు మహన్యాస రుద్రాభిషేకం
శతరుద్రీయ పారాయణం నిర్వహిస్తున్న అర్చకులు

మదనపల్లె అర్బన్‌, మే 16: చిప్పిలి గ్రామంలోని మడికయ్యలశివాలయంలో యోగభోగేశ్వరస్వామికి సోమవారం మహ న్యాస రుద్రాభిషేకం, హోమాలు నిర్వహి స్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వేశ్వరప్రసాద్‌ తెలిపారు. ఆలయ ఆవరణ లో ఆదివారం మహారుద్ర పారాయణంలో భాగంగా పదో రోజు శతరుద్రీయ పారా యణం నిర్వహించారు. ఈ నెల 17 వతేదీ సోమవారం నాటికి రుద్రపారాయణం పూర్త వుతుందన్నారు. అదే రోజు శంకర జయంతి సందర్భంగా ఉదయం 5గంటలకు  యోగ భోగేశ్వరుడికి మహన్యాస పూర్వక రుద్రాభి షేకం నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత రుద్ర, మృత్యుంజయ, నక్షత్ర, ఆయుష్షు, నారాయణ, ఇంద్రాక్షి హోమాలు నిర్వహి స్తామన్నారు. మహపూర్ణాహుతితో పారా యణం పూర్తవుతుందని తెలిపారు. కాగా పారాయణం సహా మహన్యాస రుద్రాభి షేకం, హోమాలు ఏకాం తంగా జరుగుతా యన్నారు. కరోనా విలయతాండవం చేస్తు న్న నేపధ్యంలో మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడడానికి శతరుద్రీయ పారాయణం చేస్తు న్నామని తెలిపారు. ఆదివారం జరిగిన పారాయణంలో చిత్తూరు శివకు మార్‌, కందాడ రాజేష్‌, కరణం రవీంద్ర, సాదు, గిరిధర్‌, భవానీ, సుధీర్‌, హరీష్‌, గండ్రాజుపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-17T06:06:17+05:30 IST