నేడు నారా లోకేష్‌ రాక

ABN , First Publish Date - 2022-05-20T06:28:50+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం నగరానికి రానున్నారు.

నేడు నారా లోకేష్‌ రాక

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం నగరానికి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో బయలుదేరి 1.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు స్థానిక నేతలతో మాట్లాడతారు. అనంతరం 1.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా రాజాంలో గల పార్టీ సీనియర్‌ నేత కిమిడి కళావెంకటరావు ఇంటికి వెళతారు. అక్కడ నుంచి పార్టీ నేత కోళ్ల అప్పలనాయుడు ఇంట్లో జరగనున్న వివాహానికి హాజరవుతారు. రాజాం నుంచి తిరిగి రాత్రి 7.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాద్‌ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-20T06:28:50+05:30 IST