నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ABN , First Publish Date - 2020-08-09T11:09:29+05:30 IST
పెద్దదోర్నాలలోని బొగ్గరపు కల్యాణ మండపం లో ఆదివారం నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లను ఐ టీడీఏ పీవో రవీంద్రారెడ్డి ..
పెద్దదోర్నాల, ఆగస్టు 8 : పెద్దదోర్నాలలోని బొగ్గరపు కల్యాణ మండపం లో ఆదివారం నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లను ఐ టీడీఏ పీవో రవీంద్రారెడ్డి శనివారం పరిశీలించారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివశించే చెంచు గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పథకాలపై సమీక్షించేందుకు, చెంచులతో కలిసి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వే డుకలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో తహసీల్దారు ఏవీ.హనుమంతరావు, ఆర్ఐ నాగేశ్వరరావు, ఎస్వో రామకృష్ణ, టీఏ లాల్అహ్మద్, ఆర్డీ పుష్పలత, ఏటీఎల్ నాగరాజు పాల్గొన్నారు.