అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ పూర్తి
ABN , First Publish Date - 2020-06-05T15:04:25+05:30 IST
అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ పూర్తి
సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామికి పైపూతగా మూడో విడత చందనాన్ని శుక్రవారం వేకువజామున సమర్పించారు. ఆలయ పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు పర్యవేక్షణలో ఉప ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఇతర అర్చకులు కస్తూరి, వావిలాలు, గవిలాలు, వట్టివేళ్లు, పసుపు, కుంకుమపువ్వు తదితర సుగంధ ద్రవ్యాలను మిళితం చేశారు.