నేడు అప్పన్న స్వామికి మూడో విడత చందన సమర్పణ
ABN , First Publish Date - 2021-06-24T05:47:54+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామిపై గురువారం మూడో విడత చందనాన్ని సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సింహాచలం, జూన్ 23: సింహాద్రి అప్పన్న స్వామిపై గురువారం మూడో విడత చందనాన్ని సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా గురువారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారిపై చందనాన్ని వేసేందుకు వైదిక అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం సిద్ధం చేసిన చంనపు ముద్దలో కస్తూరి, గవిలాలు, బావంచాలు, కస్తూరి పసుపు, కుంకుమపువ్వు, వట్టివేళ్లు, తదితర పన్నెండు రకాల సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని స్థానాచార్యుడు డాక్టర్ టీపీ రాజగోపాల్ పర్యవేక్షణలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో కేకే రాఘవకుమార్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, పురోహితుడు కరి సీతారామాచార్యులు, అర్చకుడు రాజీవ్, తదితరులు పాల్గొన్నారు.