నేడు ‘కె.కె.ఆర్ బహుముఖీనం’ సదస్సు

ABN , First Publish Date - 2022-06-14T06:14:33+05:30 IST

ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు, భాషావేత్త దివంగత కె.కె. రంగనాథాచార్యులు జన్మదిన ప్రత్యేక కార్యక్రమంగా నేడు ‘కె.కె.ఆర్ బహుముఖీనం’...

నేడు ‘కె.కె.ఆర్ బహుముఖీనం’ సదస్సు

ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు, భాషావేత్త దివంగత కె.కె. రంగనాథాచార్యులు జన్మదిన ప్రత్యేక కార్యక్రమంగా నేడు ‘కె.కె.ఆర్ బహుముఖీనం’ పేరిట డి. కె. సాహితీకౌసల్యం సంస్థ అంతర్జాల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కె.రెడ్డి ప్రారంభోపన్యాసంతో ఆరంభమయ్యే ఈ కార్యక్రమంలో కెకెఆర్ సాహిత్య వ్యక్తిత్వంపై ఆచార్య. డి.చంద్రశేఖర రెడ్డి, భాషా వ్యాకరణ కృషిపై ఆచార్య అయినవోలు ఉషాదేవి, పీఠికలు–వ్యాసాలపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, కవిత్వం-–కథానికా వ్యాసాలపై ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, వ్యక్తిత్వ చిత్రణా వ్యాసాలపై ఆచార్య పిల్లలమర్రి రాములు, సారస్వత వేదిక వ్యాసాలు–ఉపన్యాసాలపై డా. లక్ష్మణ‌ చక్రవర్తి ప్రసంగిస్తారు. జూమ్ వేదిక (Meeting ID: 4532277710, Passcode: telugu)గా ఉదయం 10 గం.ల నుండి మ. 1.30 వరకు జరిగే ఈ సదస్సును యూట్యూబ్ చానెల్ dksahiti kousalyamలో వీక్షించవచ్చును. 

డా. డి.గిరి

ప్రిన్సిపాల్, డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల, నెల్లూరు

Updated Date - 2022-06-14T06:14:33+05:30 IST