నేడు సుందరకాండ హోమం ముగింపు
ABN , First Publish Date - 2022-05-25T05:27:09+05:30 IST
పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయంలో 46 రోజులుగా జరుగుతున్న సుందరకాండ హోమాన్ని నేడు పూర్ణాహుతితో ముగిస్తున్నట్లు ప్రధానార్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు.
సిద్దిపేట క్రైం, మే 24: పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయంలో 46 రోజులుగా జరుగుతున్న సుందరకాండ హోమాన్ని నేడు పూర్ణాహుతితో ముగిస్తున్నట్లు ప్రధానార్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు. లోక కల్యాణార్థం నిరాటంకంగా ఈ హోమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్ణాహుతి కాగానే 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల పాటు హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు నేడు మాల విరమణ చేస్తారని చెప్పారు. రావిచెట్టు హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ స్వామిజీ పర్యవేక్షణలో తెప్పోత్సవం చేపట్టినట్లు చెప్పారు. మంత్రి హరీశ్రావు అన్నివిధాల సహకరించారని తెలిపారు. లండన్లో ఉన్న భక్తులు ఆన్లైన్ ద్వారా పూజలు స్వీకరించి మాలధారణ చేయడం గొప్ప విషయమన్నారు.