నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-10-21T06:51:21+05:30 IST

విధి నిర్వ హణలో ప్రాణా లు కోల్పోయిన పోలీస్‌ అమర వీరుల త్యాగాల ను స్మరిస్తూ నేడు జిల్లా పోలీ స్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో పోలీస్‌ అమ ర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్న ట్లు ఎస్పీ ఎస్‌. రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 10రోజుల పాటు నిర్వహించే ఈ సంస్మరణ కార్యక్రమాల్లో విద్యార్థులు, ప్రజలు పాల్గొ ని పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు.

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ముస్తాబైన పోలీస్‌ అమరవీరుల స్థూపం

సూర్యాపేట క్రైం, అక్టోబరు 20: విధి నిర్వ హణలో ప్రాణా లు కోల్పోయిన పోలీస్‌ అమర వీరుల త్యాగాల ను స్మరిస్తూ నేడు జిల్లా పోలీ స్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో పోలీస్‌ అమ ర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్న ట్లు ఎస్పీ ఎస్‌. రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 10రోజుల పాటు నిర్వహించే ఈ సంస్మరణ కార్యక్రమాల్లో విద్యార్థులు, ప్రజలు పాల్గొ ని పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు. 

పోలీసుల త్యాగం మరువలేనిది : మంత్రి జగదీ్‌షరెడ్డి

పోలీసుల త్యాగం మరువలేనిదని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అమరుల త్యాగాన్ని గుర్తుంచుకోవడమేకాకుండా, వారిని స్మరించుకోవాలన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధినిర్వహణలో పునరంకితం కావాలన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.  

Updated Date - 2021-10-21T06:51:21+05:30 IST