కాణిపాక వరసిద్ధుడికి నేడు అన్నాభిషేకం
ABN , First Publish Date - 2021-10-20T06:26:35+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి బుధవారం అన్నాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 19: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి బుధవారం అన్నాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణికానికి చెందిన సల్లాసుబ్బరాయశెట్టి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఉభయదారులుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా అల్పిసి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పరిసర గ్రామస్తులు ఆలయానికి విచ్చేసి, అన్నాలంకృతుడైన వరసిద్ధుడిని దర్శించుకోవాలని ఈవో మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.