నేటితో ఇంటర్ అడ్మిషన్ల గడువు పూర్తి
ABN , First Publish Date - 2021-01-25T05:41:47+05:30 IST
ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సోమవారంతో అడ్మిషన్ల పక్రియ పూర్తికానుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఆన్లైన్లో అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం భావించింది.
ఏప్రిల్లో ప్రాక్టికల్స్
మేలో పరీక్షలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట) జనవరి 24 : ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సోమవారంతో అడ్మిషన్ల పక్రియ పూర్తికానుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఆన్లైన్లో అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ క్రమంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆఫ్లైన్లోనే అడ్మిషన్లు చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆఫ్లైన్లోనే ఇంటర్ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగియనుంది. అయితే మరికొన్ని రోజులు ఈ గడువును పెంచాలని విద్యార్థులు తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో అడ్మిషన్ల గడువును మరి కొన్ని రోజులు పెంచుతారో.. లేదో ? చూడాలి. ఇక ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఏప్రిల్ చివర వరకు తరగతులు నిర్వహించి, మేలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్లో ప్రాక్టికల్ నిర్వహించి మేలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.