నేటి అలంకారం

ABN , First Publish Date - 2022-09-27T06:43:26+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజున బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు.

నేటి అలంకారం

శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం

రన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజున బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. బాలాత్రిపుర సుందరీదేవి చతుర్భుజాలతో ఉంటారు. జపమాల, పుస్తకం ధరించి, అభయ, వరద హస్తాలతో కరుణిస్తారు. కలువ పువ్వులో ఆసీనురాలై, సమస్త శుభాలను ప్రసాదించే దివ్యమంగళ రూపంతో మూడేళ్ల బాలికలా దర్శనమిచ్చే బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా గొప్పదనీ ఆధ్యాత్మికులు చెబుతారు. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదటగా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. త్రిపురాత్రయంలో బాలాత్రిపుర సుందరీదేవి మొదటి స్వరూపం. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సకల దారిద్ర్యాలు నశిస్తాయనీ, జ్ఞానం కలుగుతుందనీ, జీవనోపాధి లభిస్తుందనీ, చదువులలో ఉన్నతులవుతానీ అనాదిగా భక్తుల నమ్మకం. షోడశ విద్యలకు ఆమె అధిష్ఠాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణ చేస్తారు. 


నైవేద్యం: పాయసం, పులగం

అలంకరించే చీర రంగు: లేత గులాబీ రంగు

అర్చించే పూల రంగు: అన్ని రకాలూ!

పారాయణ:: లలితా త్రిశతి

Updated Date - 2022-09-27T06:43:26+05:30 IST