నేటితో ముగియనున్న ‘93వ అథ్లెట్‌ చాంప్‌’

ABN , First Publish Date - 2021-10-17T13:21:07+05:30 IST

స్థానిక పెరియమేడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15వ తేదీ నుంచి 93వ తమిళనాడు రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ 2021 పోటీలు ప్రారంభం కాగా, అవి ఆదివారం (17వ తేదీ)తో ముగియనున్నాయి.

నేటితో ముగియనున్న ‘93వ అథ్లెట్‌ చాంప్‌’

అడయార్‌(చెన్నై): స్థానిక పెరియమేడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15వ తేదీ నుంచి 93వ తమిళనాడు రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ 2021 పోటీలు ప్రారంభం కాగా, అవి ఆదివారం (17వ తేదీ)తో ముగియనున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి శివ ఎం. మెయ్యనాథన్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో దాదాపుగా 2300 మంది అథ్లెట్స్‌ పాల్గొన్నారు. ముఖ్యంగా టీఎన్‌ఏఏ తొలిసారి వెటర్న్‌ అథ్లెటిక్‌ ఈవెంట్స్‌ విభాగాల్లో 35+, 40+, 45+, 50+, 55+ కేటగిరీల్లో పోటీలను నిర్వహించింది. పురుషులు, మహిళల కోసం మొత్తం 46 ఈవెంట్స్‌, సీనియర్‌ అథ్లెట్స్‌ విభాగంలో 74 ఈవెంట్స్‌ను నిర్వహించారు. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ఎగ్మోర్‌ ఎమ్మెల్యేల పరంధామన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Updated Date - 2021-10-17T13:21:07+05:30 IST