నేటితో ముగియనున్న ‘93వ అథ్లెట్ చాంప్’
ABN , First Publish Date - 2021-10-17T13:21:07+05:30 IST
స్థానిక పెరియమేడ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15వ తేదీ నుంచి 93వ తమిళనాడు రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ 2021 పోటీలు ప్రారంభం కాగా, అవి ఆదివారం (17వ తేదీ)తో ముగియనున్నాయి.
అడయార్(చెన్నై): స్థానిక పెరియమేడ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15వ తేదీ నుంచి 93వ తమిళనాడు రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ 2021 పోటీలు ప్రారంభం కాగా, అవి ఆదివారం (17వ తేదీ)తో ముగియనున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి శివ ఎం. మెయ్యనాథన్ ప్రారంభించారు. ఈ పోటీల్లో దాదాపుగా 2300 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా టీఎన్ఏఏ తొలిసారి వెటర్న్ అథ్లెటిక్ ఈవెంట్స్ విభాగాల్లో 35+, 40+, 45+, 50+, 55+ కేటగిరీల్లో పోటీలను నిర్వహించింది. పురుషులు, మహిళల కోసం మొత్తం 46 ఈవెంట్స్, సీనియర్ అథ్లెట్స్ విభాగంలో 74 ఈవెంట్స్ను నిర్వహించారు. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ఎగ్మోర్ ఎమ్మెల్యేల పరంధామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.