పొగాకు బేళ్లు అక్రమ నిల్వ

ABN , First Publish Date - 2021-04-11T05:13:43+05:30 IST

మండలంలోని సరిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 44 పొగాకు బేళ్లను విజిలెన్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

పొగాకు బేళ్లు అక్రమ నిల్వ
విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న పొగాకు బేళ్లు

కొయ్యలగూడెం, ఏప్రిల్‌ 10 : మండలంలోని సరిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 44 పొగాకు బేళ్లను విజిలెన్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఒక గోడౌన్‌లో లోగ్రేడ్‌ పొగాకు 44 బేళ్లను నిల్వ ఉన్నట్టు విజిలెన్స్‌ అధికారులకు పిర్యాదు వెళ్లింది. వాటిని స్వాధీనం చేసుకుని కొయ్యలగూడెం పొగా కు వేలం కేంద్రానికి తరలించారు. దాడుల్లో విజిలెన్స్‌ అధికారులు జీవీ కిరణ్‌, శ్రీహ రి, దీపక్‌, పాల్గొన్నారు. సుమారు రూ.1.20లక్షల విలువ ఉంటుందని బోర్డు అధికా రులు తెలిపారు. పూర్తి విచారణ జరపుతున్నట్టు వేలం అధికారి గ్రేస్‌ తెలిపారు.


అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకును బోర్డుకు తరలిస్తుండగా కొంతమంది అడ్డుకున్నారు. పొగాకు లోడు ట్రాక్టర్లు డిప్పకాయలపాడు మీదుగా సరిపల్లి వస్తుం డగా కొంతమంది అడ్డుకున్నారు. పొగాకు నిల్వఉంచిన వారు ఎవరో తేల్చాలంటూ నిలదీశారు. ట్రాక్టర్లను వెనక్కి తీసుకువెళుతుండగా అధికారులు, మరికొంత మంది గ్రామస్థులు వచ్చి తిరిగి పొగాకు బోర్డుకు తరలించారు.

Updated Date - 2021-04-11T05:13:43+05:30 IST