ఎన్‌ఎంసీ పార్కు స్థలం మళ్లీ కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2021-07-31T05:16:33+05:30 IST

నెల్లూరులోని 42వ డివిజన్‌ జెండావీధికి సమీపంలో ఉన్న కార్పొరేషన్‌కు చెందిన పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా యత్నానికి పాల్పడ్డారు

ఎన్‌ఎంసీ పార్కు స్థలం మళ్లీ కబ్జాకు యత్నం
పార్కు స్థలం

నెల్లూరు (సిటీ), జూలై 30 : నెల్లూరులోని 42వ డివిజన్‌ జెండావీధికి సమీపంలో ఉన్న కార్పొరేషన్‌కు చెందిన పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా యత్నానికి పాల్పడ్డారు. గతంలో ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ యుద్ధప్రాతిపదికన సిటీప్లానింగ్‌ విభాగాన్ని రంగంలోకి దింపి కబ్జా యత్నాలను అడ్డుకున్నారు. తాజాగా మరో వ్యక్తి తెగించి అదే స్థలాన్ని ఆక్రమించేందుకు తెగబడ్డాడు. రక్షణ గోడలను తొలగించి, స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కబ్జాకు వీలు లేకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-07-31T05:16:33+05:30 IST