జింబాబ్వే టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌

ABN , First Publish Date - 2022-08-12T09:21:21+05:30 IST

జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు.

జింబాబ్వే టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌


న్యూఢిల్లీ: జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. రాహుల్‌ ఫిట్‌గా ఉన్నట్టు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ ధ్రువీకరించడంతో ఈ సిరీ్‌సకు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. రాహుల్‌కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో తొలుత సారథిగా ప్రకటించిన శిఖర్‌ ధవన్‌.. వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శస్త్రచికిత్స తర్వాత కోలుకొన్న రాహుల్‌ను వెస్టిండీస్‌ టూర్‌కు ఎంపిక చేశారు. కానీ, కరోనా సోకడంతో ఆడే అవకాశం దక్కలేదు. అయితే, ఆసియా కప్‌ కోసం రాహుల్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాలనే ఉద్దేశంతో జింబాబ్వే టూర్‌కు అతడిని పక్కనబెట్టారు. కాగా, రాహుల్‌ టీమ్‌లోకి రావడంతో.. ఓపెనర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు కష్టమే..! ఈ నెల 18 నుంచి హరారేలో మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. 

Updated Date - 2022-08-12T09:21:21+05:30 IST