దొడ్డు బియ్యం లబ్ధిదారులకు... సన్న బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2022-01-22T05:55:36+05:30 IST

దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసి, సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని అమీనాబాద్‌ గ్రామ 6వ నెంబర్‌ రేషన్‌ దుకాణ డీలర్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీఎ్‌సవో విజయలక్ష్మి తెలిపారు.

దొడ్డు బియ్యం లబ్ధిదారులకు... సన్న బియ్యం పక్కదారి

విచారణలో గుర్తించిన అధికారులు

రేషన్‌ దుకాణం సీజ్‌

అనంతగిరి, జనవరి 21 : దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసి, సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని అమీనాబాద్‌ గ్రామ 6వ నెంబర్‌ రేషన్‌ దుకాణ డీలర్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీఎ్‌సవో విజయలక్ష్మి తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. రంగాయిగూడెం షాప్‌ నెంబర్‌ 22వ దుకాణానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న డీలర్‌ కోటయ్య 6, 22 దుకాణాల్లో సుమారు 25 క్వింటాళ్ల 65 కిలోల రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించాడు. దీనికితోడు లెక్కలు చూపకపోవడం, గ్రామంలో కొద్దినెలలుగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తూ లబ్ధిదారులకు కేవలం దొడ్డుబియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు రేషన్‌డీలర్‌ కోటయ్య నిర్వహిస్తున్న దుకాణ రికార్డులు పరిశీలించి, బియ్యం పక్కదారి పట్టించినట్లు రుజువుకావడంతో సెక్షన్‌-6ఏ యాక్టు ప్రకారం చర్యలు తీసుకున్నారు. దుకాణాన్ని సీజ్‌ చేసినట్లు డీలర్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీఎస్‌వో తెలిపారు. 

Updated Date - 2022-01-22T05:55:36+05:30 IST