అత్యాచారం కేసులో ఇరుక్కున్న భర్త.. అతడిని రక్షించేందుకు భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే.. చివరకు..
ABN , First Publish Date - 2022-02-16T22:06:18+05:30 IST
అతను రైల్వే శాఖలో ఉద్యోగి.. వేరే ఊరికి బదిలీ కావడంతో భార్యను వదిలి అక్కడకు వెళ్లిపోయాడు..
అతను రైల్వే శాఖలో ఉద్యోగి.. వేరే ఊరికి బదిలీ కావడంతో భార్యను వదిలి అక్కడకు వెళ్లిపోయాడు.. తనకు వివాహం కాలేదని చెప్పి ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. కొన్ని రోజుల తర్వాత ఆ యువతికి అసలు విషయం తెలిసింది.. దీంతో ఆమె అతడిపై అత్యాచారం కేసు పెట్టింది.. ఉద్యోగానికే ముప్పు రావడంతో నిందితుడి భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. తన భర్తతో ఆ అత్యాచార బాధితురాలికి పెళ్లి చేసింది.. తాజాగా ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది..
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన దశరథ్ అనే రైల్వే ఉద్యోగికి 2018లో కరోండ్ ప్రాంతానికి బదిలీ అయింది. అక్కడ తనకు వివాహం కాలేదని చెప్పి పాతికేళ్ల యువతితో దశరథ్ ప్రేమాయణం సాగించాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతికి దశరథ్ వివాహితుడు అనే విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి దశరథ్పై అత్యాచారం కేసు పెట్టింది. ఉద్యోగానికే ముప్పు రావడంతో దశరథ్ భార్య వినిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
తన భర్తతో ఆ అత్యాచార బాధితురాలికి పెళ్లి చేసింది. అనంతరం ముగ్గురూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ భార్యభర్తలిద్దరూ ఆ యువతిని వేధించడం ప్రారంభించారు. ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి తాజాగా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.