తరగతి గదిలోకి రావాలంటే... మూడుసార్లు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-08-02T21:06:35+05:30 IST

‘తరగతులకు హాజరు కావాలంటే మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి’... అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నుంచి వెలువడిన ప్రకటన ఇది. వివరాలిలా ఉన్నాయి.

తరగతి గదిలోకి రావాలంటే... మూడుసార్లు కరోనా పరీక్షలు

బోస్టన్ : ‘తరగతులకు హాజరు కావాలంటే మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి’... అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నుంచి వెలువడిన ప్రకటన ఇది. వివరాలిలా ఉన్నాయి.  

మొదట విద్యార్థులు క్యాంపస్ కు చేరుకున్న వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. మూడు రోజుల తర్వాత మరోసారి, ఆ తర్వాత... రెండు రోజుల అనంతరం మరోసారి పరీక్షలు చేయించుకోవాలి. ఇక... మోదటి టెస్ట్ ఫలితం వచ్చే వరకు విద్యార్ధులు.. క్వారంటైన్ లో ఉండాలి. రెండు, మూడు రిపోర్టుల ఫలితాలు వచ్చిన తరువాత కరోనా సోకలేదని తేలితే మాత్రమే తరగతి గదుల్లోకి అనుమతిస్తారు. ఆన్ క్యాంపస్ లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. కరోనా పరీక్షలపై ఆసక్తి చూపని వాళ్లు... ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావాలని పేర్కొంది. వ్యక్తిగతంగా క్లాసులకు అటెండ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ మూడు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది.


Updated Date - 2020-08-02T21:06:35+05:30 IST