ఏప్రిల్‌లో ఇండియా రానున్న ఇజ్రాయెల్ ప్రధాని

ABN , First Publish Date - 2022-03-20T18:09:14+05:30 IST

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీ వినతి మేరకు ఏప్రిల్ 2-5 వరకు నఫ్టాలీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఏప్రిల్‌లో ఇండియా రానున్న ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీ వినతి మేరకు ఏప్రిల్ 2-5 వరకు నఫ్టాలీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ, నఫ్టాలీని ఆహ్వానించారు. నఫ్టాలీ ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా రావడం ఇదే మొదటిసారి. గత అక్టోబర్‌లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ-నఫ్టాలీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో మోదీ, నఫ్టాలీని ఇండియా రమ్మని ఆహ్వానించారు. నఫ్టాలీ భారత పర్యటన సందర్భంగా ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు పలు అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా ఇన్నోవేషన్ టెక్నాలజీ, భద్రత, సైబర్, ఎకానమీ, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. భారత పర్యటన కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు నఫ్టాలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T18:09:14+05:30 IST