‘విద్యార్థుల జీవితాలతో చెలగాటం మంచిది కాదు’
ABN , First Publish Date - 2021-05-17T05:06:28+05:30 IST
కొవిడ్ ప్రబలుతున్న సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రభుత్వానికి మంచిది కాదని టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజ నేయులు అన్నారు.
ఆదోని, మే 16: కొవిడ్ ప్రబలుతున్న సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రభుత్వానికి మంచిది కాదని టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజ నేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాస్తే, పరీక్షలు నిర్వహిస్తామని సమాధానం ఇవ్వడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పది లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 7500 మంది మృతిచెందారని అన్నారు. రోజుకు 10 వేల కేసులు నమోదు అవుతున్న సమయంలో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరకడం లేదని అన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్రెడ్డి మొండి పట్టును వీడి, పరీక్షలను రద్దు చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సూర్య, నూర్, అభి, ఆది, సిద్దు పాల్గొన్నారు.