టీఎన్ఎస్ఎఫ్ నేతలకు రిమాండ్
ABN , First Publish Date - 2021-01-24T04:15:32+05:30 IST
టీఎన్ఎస్ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఐదుగురు నేతలను పోలీసులు నరసరావుపేట సబ్ జైలుకు...
గుంటూరు: టీఎన్ఎస్ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఐదుగురు నేతలను పోలీసులు నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు. జీ.ఓ నెంబర్-77 రద్దు కోసం శుక్రవారం సీఎం ఇంటి ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. ముట్టడికి అనుమతి లేదంటూ ప్రణవ్ గోపాల్, మన్నవ వంశీ, నిమ్మగడ్డ సత్య ప్రసాద్, మువ్వా శరత్బాబు, నెలకుర్తి సుప్రవర్త్పై కేసులు నమోదు చేశారు. తొలుత ఈ ఐదుగురిపై తాడేపల్లి పోలీసులు అత్యాచారం కేసులు నమోదు చేశారు. జడ్జి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.