సంక్షేమ పథకాల అమలుపై సర్వే
ABN , First Publish Date - 2020-10-31T10:23:45+05:30 IST
అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే వై సీపీ ప్రభుత్వం ధ్యేయమని తణుకు మండల వైసీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అన్నారు.
తణుకురూరల్, అక్టోబరు 30 : అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే వై సీపీ ప్రభుత్వం ధ్యేయమని తణుకు మండల వైసీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అన్నారు. ముద్దాపురంలో శుక్రవారం జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పఽథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే దానిపై సర్వే చేశారు. ఎవ రైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ తణుకు మండల మహిళా అధ్యక్షురాలు ముళ్ళపూడి రూప, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ములగాల బాబూరావు, నాగసత్యనారాయణ పాల్గొన్నారు.