ముంపు బాధిత రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-30T12:01:37+05:30 IST

ముంపు బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు.

ముంపు బాధిత రైతులను ఆదుకోవాలి

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆందోళన


అత్తిలి, అక్టోబరు 29 : ముంపు బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు. ఒక్క వరిగేడులోనే 14050 ఎకరాలకు రూ.20 వేలు చొప్పున సుమారు రూ. 3 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రస్తుం పంట చేతికి రాని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు  భరోసా కల్పించాలన్నారు.రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.రైతులకు తక్షణ సాయంగా రూ. 10 వేలు ప్రకటించాలన్నారు. ఎన్యూమరేషన్‌ పూర్తిస్థాయిలో వచ్చేలా చూడాలన్నారు.కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అనాల ఆదినారాయణ, పూతినీడి శ్రీనివాసు,అడ్డాల బాబ్జి, బొద్దాల శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T12:01:37+05:30 IST