విదుల కుమారికి గాంధీ పీస్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-09-28T11:51:11+05:30 IST

గాంధీ జయ ంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ సర్వోదయ మండలి ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి (గాంధీపీస్‌ అవార్డు) నిడదవోలుకు చెందిన చర్ల విదుల కుమారి (80) ఎంపికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు చర్ల గణపతి

విదుల కుమారికి గాంధీ పీస్‌ అవార్డు

 ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 27: గాంధీ జయ ంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ సర్వోదయ మండలి ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి (గాంధీపీస్‌ అవార్డు) నిడదవోలుకు చెందిన చర్ల విదుల కుమారి (80) ఎంపికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు చర్ల గణపతి శాస్త్రి కుమార్తె ఈమె. 40 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గాంధీజీ సత్యం, అహింసా విధానాలను పాటిస్తూ అనాథలకు ఆశ్రయం కల్పిస్తు న్నారు.


అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 2వ తేదీన మల్లవరం గాంధీ స్మారక కేంద్రంలో విదుల కుమారికి గాంధీ పీస్‌ అవార్డును అందజేస్తామని జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందు కూరి ప్రసాదరాజు, రాష్ట్ర సర్వోదయ కార్యదర్శి జీవీఎస్‌డీ ప్రసాద్‌  తెలిపారు. 

Updated Date - 2020-09-28T11:51:11+05:30 IST