రేపు మన్యం బంద్
ABN , First Publish Date - 2020-09-28T11:49:25+05:30 IST
ఆంధ్రా, తెలంగాణ మన్యం బంద్ను ఈ నెల 29న జయప్రదం చేయాలని సీపీఎం ఏపీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీపీఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు.
పోలవరం, సెప్టెంబరు 27: ఆంధ్రా, తెలంగాణ మన్యం బంద్ను ఈ నెల 29న జయప్రదం చేయాలని సీపీఎం ఏపీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీపీఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారాలు అందించి పునరావాసం కల్పిం చాలని, జీవో నెం.3ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు.
నాన్షెడ్యూల్ ఏరియాల్లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాల్లోకి తీసుకురావాలని కోరుతూ ఈ నెల 29న ఆంధ్రా, తెలంగాణ మన్యం ప్రాంతాల్లో జరగనున్న బంద్ని ప్రజానీకం వ్యాపార, వర్తక సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు జయప్రదం చేయాలని కోరారు. ఏపీ గిరిజన సంఘం పోలవరం మండల కార్యదర్శి గొరగం భూచంద్రం మాట్లా డుతూ ప్రతీ గిరిజనుడికి పది ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.