592 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-28T11:50:26+05:30 IST

జిల్లాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. కరోనా పరీక్షా కేంద్రాలను శుద్ధి చేసే కార్యక్రమం ఉం డడంతో ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గించారు. దీంతో జిల్లాలో 592 కేసులే నమోదయ్యాయి.

592 పాజిటివ్‌ కేసులు

ఏలూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) :  జిల్లాలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. కరోనా పరీక్షా కేంద్రాలను శుద్ధి చేసే కార్యక్రమం ఉం డడంతో  ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గించారు. దీంతో జిల్లాలో 592 కేసులే నమోదయ్యాయి.వీటిలో వంద కేసులు ఒక్క భీమవరంలోనే వచ్చాయి. తాడేపల్లి గూడెం 75, పెనుగొండ 35, పెంటపాడు 33, పాల కోడేరు 33, పాలకొల్లు 32 కేసులు నమోదయ్యాయి.


పెనుమంట్ర 27, తణుకు 26, ఉండ్రాజవరం 22 కేసులు నమోదవ్వగా జిల్లా కేంద్రమైన  ఏలూరులో 20 కేసులు మాత్రమే వచ్చాయి. పెదవేగి 17, చింతలపూడి 14, నరసాపురం 13, ఇరగవరం 10, పెరవలి 9, జంగారెడ్డిగూడెం 8 కేసులు నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో  నిడదవోలు 3, కొవ్వూరు 2 సహా మిగిలిన అన్ని గ్రామీణ మండలాల్లో ఐదు కంటే తక్కువే కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఆదివారం నలుగురు మరణించగా జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 444కు చేరింది.

Updated Date - 2020-09-28T11:50:26+05:30 IST