సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన టీఎన్జీఓలు
ABN , First Publish Date - 2020-07-10T19:20:58+05:30 IST
కొత్తగా నిర్మించనున్న సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదులను కూడా కొత్తగా నిర్మిస్తామని, అందుకు పూర్తిగా ప్రభుత్వ నిధులనే వినియోగిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించడపట్ట తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హర్షం ప్రకటించింది.
హైదరాబాద్ : కొత్తగా నిర్మించనున్న సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదులను కూడా కొత్తగా నిర్మిస్తామని, అందుకు పూర్తిగా ప్రభుత్వ నిధులనే వినియోగిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించడపట్ట తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హర్షం ప్రకటించింది.
సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలనుంచి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు, ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని కొత్త మసీదు మరియు దేవాలయాలు కలిగిస్తాయని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీఓఏ) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్ పేర్కొన్నారు.
కాగా... సచివాలయ భవనాలు కూల్చివేస్తున్న సందర్భంగా మసీదు, నల్ల పోచమ్మ దేవాలయాలు ధ్వంసం కావడంపట్ల బాధను వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్... తక్షణమే స్పందించి నూతన సచివాలయంలో అందరి మనోభావాలకు అణుగుణంగా మసీదును, నల్ల పోచమ్మ దేవాలయాలను నిర్మిస్తామని చెప్పడం ఆయన సహృదయతకు, సెక్యులరిజానికి నిదర్శనమని పేర్కొన్నారు.