టీనగర్ డీఎంకే అభ్యర్థికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-11T12:58:28+05:30 IST
స్థానిక టి.నగర్ శాసనసభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి కరోనా వైరస్ తాకిడికి గురయ్యారు. ఎన్నికల సమయంలో
చెన్నై: స్థానిక టి.నగర్ శాసనసభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి కరోనా వైరస్ తాకిడికి గురయ్యారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గమంతటా తీవ్ర ప్రచారం చేసిన కరుణానిధి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు అధికమ వటంతో వైద్యపరీక్షలు చేసుకున్నారు. ఆ పరీక్షలలో ఆయన కు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. దీనితో చెన్నై ఆళ్వార్పేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్సలందిస్తున్నారు. కరుణానిధి సోదరుడు, చేపాక్-ట్రిప్లికేన్ డీఎంకే శాసనసభ్యుడు గతేడాది కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే.