పాఠశాలల్లో టీఎంఎఫ్ అమలు
ABN , First Publish Date - 2022-06-26T04:57:45+05:30 IST
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ మెయిన్టెన్స్ ఫండ్ (టీఎంఎఫ్)ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
నెల్లూరు (విద్య) జూన్ 25 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ మెయిన్టెన్స్ ఫండ్ (టీఎంఎఫ్)ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులను పరిశుభ్రంగా ఉంచడం కోసం టీఎంఎఫ్ను అమలు చేస్తామని తెలిపారు. ఈ నిధులను పాఠశాల విద్యాశాఖ పరిదిలోని అన్ని ప్రభుత్వ, జూనియర్ కళాశాలల్లోని టాయిలెట్లు, వాష్బేసిన్లు, ఇతర అనుబంధ వస్తువులకు వినియోగిస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా జిల్లా ప్రాజెక్ట్ మానటరి ంగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో విధుల నిర్వహణకు జిల్లా కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటన్లను నియమించారని, కోఆర్డినేటర్కు రూ.25వేలు, డేటా ఎంట్రీ ఆపరేట ర్కు 15 వేలు ఉండగా ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం రూ.18,500కు పెంచారని తెలిపారు.