శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ABN , First Publish Date - 2022-01-11T13:39:20+05:30 IST

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఈరోజు(మంగళవారం) ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది.

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఈరోజు(మంగళవారం) ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే నేటి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. 

Updated Date - 2022-01-11T13:39:20+05:30 IST