రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబు..బయటకు అనుమతించని పోలీసులు
ABN , First Publish Date - 2021-03-01T15:50:30+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయానికి ఇండిగో విమానంలో చేరుకున్నారు.
తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయానికి ఇండిగో విమానంలో చేరుకున్నారు. ప్రయాణికుల కంటే ముందు విమానం దిగిన చంద్రబాబు వీఐపీ లాంజ్లో కూర్చున్నారు. బ్లాక్ క్యాట్ కామాండోలు అరైవల్ గేట్ వద్దకు చేరుకున్నప్పటికీ... చంద్రబాబు కాన్వాయ్ ఇంకా గేట్ వద్దకు రాలేదు. చంద్రబాబును లాంజ్ నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో గంట పాటుగా ఆయన ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. మరోవైపు చిత్తూరు, తిరుపతిలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్లు చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకుని టీడీపీ కార్యకర్తలు... చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే వారిని ఎయిర్పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు.