సుప్రీంకోర్టు సీజే ఆవిష్కరించిన ‘తిరుపతి కథలు’
ABN , First Publish Date - 2021-06-17T07:13:56+05:30 IST
తిరుపతి రచయిత పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన ‘తిరుపతి కథలు’ పుస్తకాన్ని బుధవారం సాయంత్రం హైదరాబాద్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.
గ్రంథ రచయిత పేటశ్రీకి దక్కిన అరుదైన గౌరవం
తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూన్ 16: తిరుపతి రచయిత పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన ‘తిరుపతి కథలు’ పుస్తకాన్ని బుధవారం సాయంత్రం హైదరాబాద్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మండలి బుద్ధప్రసాద్, కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయకుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1200 పేజీల ఈ గ్రంథాన్ని ఎమెస్కో సంస్థ ప్రచురించింది. తిరుపతి, తిరుమల పరిసరాల గురించిన ఆసక్తికరమైన అనేక విశేషాలను పేట శ్రీనివాసులురెడ్డి కథలుగా రాశారు. ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో సీరియల్గా వీటిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి.