Tirupatiలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-03T13:55:29+05:30 IST
నగరంలోని కరకంభాడి రోడ్డులో డీమార్టు దగ్గర రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతి: నగరంలోని కరకంభాడి రోడ్డులో డీమార్టు దగ్గర రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. డీమార్టులో విధులను ముగించుకుని వెళ్తన్న లోకేష్ స్పాట్లోనే మృతి చెందగా.... తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవీణ్, విష్ణు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు కడప జిల్లా చిట్వేల్ వాసులుగా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి విష్ణును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.