తిరుపతి మీట్ వివరాలపై సీఎం జగన్‌కు నివేదిక

ABN , First Publish Date - 2021-02-26T03:31:08+05:30 IST

తిరుపతి మీట్ వివరాలపై సీఎం జగన్‌కు నివేదిక

తిరుపతి మీట్ వివరాలపై సీఎం జగన్‌కు నివేదిక

అమరావతి: తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల సీఎంలు హాజరుకానున్నారు.  అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. దీనిపై క్యాంప్ కార్యాలయంలో సీఎం  వైయస్ జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలపై వివరాలను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. 

Updated Date - 2021-02-26T03:31:08+05:30 IST