Tirupati: కపిలతీర్థంలో భక్తుల కష్టాలు

ABN , First Publish Date - 2021-11-08T14:00:10+05:30 IST

కార్తీకమాసం తొలి సోమవారం టీటీడీ ఆధ్వర్యంలోని శైవాలయం కపిల తీర్థంలో భక్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు.

Tirupati: కపిలతీర్థంలో భక్తుల కష్టాలు

తిరుపతి: కార్తీకమాసం తొలి సోమవారం టీటీడీ ఆధ్వర్యంలోని  శైవాలయం కపిల తీర్థంలో భక్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ నిబంధనల పేరుతో శివునికి అర్చకులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్తీక సోమవారం కూడా ఉదయాన్నే భక్తులను అనుమతించకపోవటం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సెక్యురిటీతో భక్తులు వాదులాటకు దిగారు. గేటు వద్ద వందలాదిగా భక్తులు గుమిగూడారు. ‘‘ఇలా గేటు వద్ద భక్తులు గుమ్మిగూడితే కొవిడ్ రాదా? క్యూ లైన్ లో వెళ్లి దేవుడిని దర్శిస్తే మాత్రమే కొవిడ్ వస్తుందా?’’ అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-11-08T14:00:10+05:30 IST