Tirupatiలో కొవిడ్ రోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-17T17:34:20+05:30 IST

కొవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ రోగులు ఆందోళనకు దిగారు.

Tirupatiలో కొవిడ్ రోగుల ఆందోళన

తిరుపతి: కొవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రంలో నిరసన చేపట్టారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని బాధితులు ఆవేదన చెందారు. అల్పాహారం, భోజనం నాణ్యతగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. లిఫ్ట్ కూడా పని చేయకపోవడంతో గర్భిణీలు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-17T17:34:20+05:30 IST