Tirupati: అన్ని వర్గాలకు సీఎం న్యాయం చేశారు: డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2021-07-18T19:10:47+05:30 IST

Tirupati: అన్ని వర్గాలకు సీఎం న్యాయం చేశారు: డిప్యూటీ సీఎం

Tirupati: అన్ని వర్గాలకు సీఎం న్యాయం చేశారు: డిప్యూటీ సీఎం

తిరుపతి: నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి న్యాయం చేశారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మహిళలకు 50.4శాతం రిజర్వేషన్ కల్పించారని, 30 లక్షల 50 వేల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందని నారాయణస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారాయణస్వామి విమర్శించారు. ప్రతి పక్షనేతకు అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా? అని నారాయణస్వామి ప్రశ్నించారు. రైతన్నలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుందని, 14 ఏళ్లలో అణగారిన వర్గాలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని నారాయణస్వామి ప్రశ్నించారు.

Updated Date - 2021-07-18T19:10:47+05:30 IST