తిరుపతి అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జీవీఎల్

ABN , First Publish Date - 2020-11-25T17:07:22+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలలో అభివృద్ధి ఎజెండా బీజేపీ, జనసేన పోటీ చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు.

తిరుపతి అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జీవీఎల్

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలలో అభివృద్ధి ఎజెండా బీజేపీ, జనసేన పోటీ చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి అనేది అరుదుగా కనిపించే మాటన్నారు. రాష్ట్రంలో కుల, ధన రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ తిరుపతి ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో చెప్పి... ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని బీజేపీ సవాల్ విసురుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతితో కూడిన అభివృద్ధి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రాంత అభివృద్ధిపై బీజేపీ చర్చకు సిద్ధమని జీవీఎల్ సవాల్ విసిరారు. 

Updated Date - 2020-11-25T17:07:22+05:30 IST