శ్రీవారి ఆర్జితసేవల ఆన్లైన్ టికెట్ల కోటా విడుదల
ABN , First Publish Date - 2021-02-26T08:28:02+05:30 IST
మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను గురువారం ఉదయం టీటీడీ విడుదల చేసింది...
తిరుమల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను గురువారం ఉదయం టీటీడీ విడుదల చేసింది. ఈ టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం ద్వారా ఇళ్ల నుంచే ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా, కల్యాణోత్సవ టికెట్లు పొందిన గృహస్థులకు (ఇద్దరు) ఆ టికెట్పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. అయితే కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు మార్చి31వ తేదీ లోపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ను బుక్ చేసుకోవాలి.