శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల

ABN , First Publish Date - 2021-02-26T08:28:02+05:30 IST

మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్‌ (వర్చువల్‌) టికెట్ల కోటాను గురువారం ఉదయం టీటీడీ విడుదల చేసింది...

శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల

తిరుమల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్‌ (వర్చువల్‌) టికెట్ల కోటాను గురువారం ఉదయం టీటీడీ విడుదల చేసింది. ఈ టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం ద్వారా  ఇళ్ల నుంచే ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా, కల్యాణోత్సవ టికెట్లు పొందిన గృహస్థులకు (ఇద్దరు) ఆ టికెట్‌పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. అయితే కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు మార్చి31వ తేదీ లోపు  రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను బుక్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-02-26T08:28:02+05:30 IST