నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ జూనియర్ డాక్టర్లు నిరసన
ABN , First Publish Date - 2020-08-12T00:07:16+05:30 IST
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ జూనియర్ డాక్టర్లు నిరసన
తిరుపతి: తిరుపతిలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అత్యవసర కేసులు, అత్యవసర శస్త్ర చికిత్సలు, కొవిడ్ డ్యూటీలకు నల్ల బ్యాడ్జీలతో జూడాలు హాజరవుతున్నారు. కోవిడ్ సమయంలోనూ విధులకు హాజరవుతున్న తమకు రూ. కోటి నుంచి రూ. 50 లక్షల ఇన్సురెన్స్, నాణ్యమైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు సరిపడంత వైద్య విభాగాల సిబ్బంది అన్ని విభాగాల్లో ఉండాలన్నారు. సొషియల్ సెక్యూరిటీ కల్పించాలని, రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన స్టైఫండ్ ను తక్షణం పెంచాలని, జనవరి 2020కి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జీవో 287 ప్రకారం వెంటనే స్టైఫండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేశారు.