ఏపీ టూరిజం శాఖ సూపర్వైజర్ చంద్రశేఖర్ హత్య
ABN , First Publish Date - 2022-01-04T16:52:21+05:30 IST
ఏపీ టూరిజం శాఖ సూపర్వైజర్ చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు.
తిరుపతి: ఏపీ టూరిజం శాఖ సూపర్వైజర్ చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ను హత్య చేసిన నిందితులు... మృతదేహాన్ని భాకరాపేట అడవుల్లో పడేశారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ వద్ద అప్పులు తీసుకున్న వాళ్లే అతనిని ప్రణాళిక ప్రకారం హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతదేహం కోసం బాకరాపేట అటవీ ప్రాంతానికి పోలీసులు వెళ్తున్నారు.