Tirupati: నీట మునిగిన వాహనం...వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-10-23T16:14:17+05:30 IST

భారీ వర్షం కారణంగా నగరంలోని వెస్ట్ చర్చి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం నీట మునిగింది. ఈ ప్రమాదంలో సంధ్య అనే వివాహిత మృతి చెందింది.

Tirupati: నీట మునిగిన వాహనం...వివాహిత మృతి

తిరుపతి: భారీ వర్షం కారణంగా నగరంలోని వెస్ట్ చర్చి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం నీట మునిగింది. ఈ ప్రమాదంలో సంధ్య అనే వివాహిత మృతి చెందింది. మృతురాలు కర్ణాటక రాష్ట్రం రాయచూరు వాసిగా గుర్తించారు. శ్రీవారి దర్శనం కోసం నిన్న తూఫాన్ వాహనంలో రాయచూరు నుంచి ఏడుగురు సభ్యులతో తిరుపతికి పయనమయ్యారు. నగరంలోని వెస్ట్ చర్చి కూడలి వద్ద అర్ధరాత్రి భారీ వర్షపు నీటిలో ఇరుక్కుపోయి వాహనం నీటమునిగింది. వాహనంలో ఉన్న సంధ్య ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా..మరో రెండేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-23T16:14:17+05:30 IST